దక్షిణ కైలాసము- దక్షిణ కాశి

                                   దక్షిణ కైలాసము- దక్షిణ కాశి

 ఈశ్వరుని అజ్ఞా చేత బ్రహ్మ దేవుడు కైలాసమున గల శిఖరములో ముఖ్యమైన శివానందైక నిలయమును,శిఖరమును శ్రీ కాళహస్తి క్షేత్రంలో స్తాపించి,శివుని పూజించి ధన్యుడాయేను.దీని వలన శ్రీ కాళహస్తిలో వెలసిన పర్వతమునకు దక్షిణ కైలాసము అని పేరు వచ్చెను.


  శ్రీకాళహస్తిశ్వరాలయం అనుకోని సువర్ణముఖినది ఉత్తర వాహినిగా,ఆలయమునకు అనుకోని ప్రవహించుచున్నది. పక్షిమ భాగమున,తిరుమంజన గోపురమున్ కేదురగానున్న నదిస్నాన ఘట్టమునకు,మణికర్ణిక ఘట్టము అని పేరు. కాశి వాలే ఇచ్చట ఉత్తరవాహిని నదియు,మణికర్ణికా స్నానఘట్టమును నుండుటచే దీనికి దక్షిణకాశియని పేరు గలిగినది.ఇక్కడ కుడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశంగా గావించుచున్నాడట

                                             ఆలయ నిర్మాణ పద్ధతి

 భారత దేశమందలి ఆలయముల వాలేగాక శ్రీ కాళహస్తిశ్వరుని ఆలయ నిర్మాణంలో నొక విసిస్థత గలదు.ఇచ్చట వినాయకుడు,శ్రీకాళహస్తిశ్వరుడు,దక్షిణామూర్తి,అమ్మవార్లు, ఒక్కకరు దిక్కునకు వెలసియున్నారు.దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధకామ మోక్షములను చతుర్విద పురుషార్ధక సూచనమే ఈ దేవాలయముఅని మనస్సుకు తోచుచున్నాదని పెద్దల నమ్మిక.మొదటి దైవ ధర్మము,ఆత్మధర్మమూగ  ఉత్తరాభి ముఖ్యమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో తెలియనగును.రెండొవది అర్ధము.ఆత్మజ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంభిక దేవి తుర్ఫుముఖముగా నిలిచి ముముక్షవులకు బోధించుచుండెను.ముడోవడైన కామము ,దక్షిణ ముఖముగా నుండి(మహాద్వారముకు ఎదురుగా) సత్సశిసుందర దక్షిణామూర్తిత్వం,గురుస్వరూపంలో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని తెలియనగును

 తుదిగా మోక్షము మోక్షదికారియైన పరమశివుని స్వరూపమగు శ్రీ కాళహస్తిశ్వరుడు పశ్చిమాభిముకముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యం అని తెలుప బడింది.అప్పటికప్పుడే శివ సాయుజ్య[ప్రాప్తికి ప్రయత్నం జేయవలయును సుక్ష్మ సందేశము అందించు చున్నాడు. ఇట్లు మనవోజ్జివన సాధనములు అయిన ధర్మార్ధకామమోక్షములను నొక ప్రతికయే శ్రీ కాళహస్తిశ్వరాలయం.

No comments:

Post a Comment